నిజామాబాద్ క్రైం,సెప్టెంబర్ 2: మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ అన్నారు. పోక్సో కేసుల్లో నిందితులకు త్వరగా శిక్ష పడేలా దర్యాప్తు నిర్వహిస్తామని పేర్కొన్నారు. శనివారం ఆయన నిజామాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు పోలీస్ కమిషనరేట్కు చేరుకున్న ఆయన పోలీస్ గౌరవవందనం స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన పోలీస్ కమిషనరేట్లోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు నమోదైన పోక్సో కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా సిబ్బంది సహకారంతో దర్యాప్తు చేపడుతామన్నారు. ప్రస్తుతం సమాజంలో ఇతర నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ సైబర్ నేరాలు మాత్రం పెరిగిపోతున్నాయని అన్నారు. వాటిని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు తనదైన శైలిలో పనిచేస్తామన్నారు. ప్రజలకు దగ్గరగా ఉంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను పరింత పటిష్టం చేస్తామని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.
పెండింగ్లో ఉన్న కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి కృషిచేస్తామన్నారు. రానున్న ఎన్నికలను ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో అదనపు డిప్యూటీ కమిషనర్ పోలీస్ (ఎల్ ఆండ్ వో), ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, స్పెషల్ బ్రాంచ్ శ్రీశైలంతో పాటు సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనను సీఐలు, ఎస్సైలు, డీసీవో సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.