చందూర్, జనవరి 2 : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత రెండు నెలలుగా సదరం క్యాంపులు నిర్వహించలేదు. దీంతో చాలా మంది దివ్యాంగులు శిబిరాల కోసం ఎదురు చూశారు. వైకల్య నిర్ధారణ కోసం స్లాట్లు బుక్ చేసుకునేందుకు మంగళవారం అవకాశం ఉండగా వందల సంఖ్యలో బాధితులు మీ సేవ కేంద్రాల వద్ద క్యూ కట్టారు.
ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన స్లాట్లు క్షణాల వ్యవధిలో బుక్ అయ్యాయి. మొత్తం 390 స్లాట్లు ఇవ్వగా, జిల్లావ్యాప్తంగా 200కు పైగా మీ సేవ కేంద్రాల్లో ఒక్కొక్కరికే స్లాట్ దక్కింది. వేకువ జాము నుంచి పడిగాపులు కాసిన దివ్యాంగులంతా ఊసురుమంటూ వెనుదిరిగారు.