డిచ్పల్లి/ నిజామాబాద్ రూరల్, జనవరి 12: రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు భూస్థాపితం చేయడం ఖాయమని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బీజేపీ మోసపూరిత పార్టీ అని అందుకే ఆ పార్టీని వీడుతున్నారని చెప్పారు. డిచ్పల్లి, ఇందల్వాయి మండలాలకు చెం దిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆర్టీసీ చైర్మన్ సమక్షంలో గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నిజామాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో వారికి గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డిచ్పల్లి మండలం దూస్గావ్కు చెందిన బీజేపీ మండల యూత్ నాయకుడు మంద అనిల్తో పాటు ఎర్ర సిద్ధు, నరేశ్, మంద హరిభూషణ్, ఎల్లోళ్ల సతీశ్, సాయిగౌడ్, కే.సుమన్, శేరు రాజు, బట్టి శ్రీకాంత్, గుర్రపు లిం బాద్రి బీఆర్ఎస్లో చేరారు.
గ్రామానికి చెందిన వంద మంది ముదిరాజ్ కులస్తులు కూడా బీఆర్ఎస్లో చేరగా వారికి బాజిరెడ్డి గులాబీ కండువా కప్పారు. పార్టీలో చేరిన వారిలో చరణ్, ఆర్.ప్రశాంత్, ఆర్.చరణ్, వంశీ, గుర్రపు గంగాధర్ తదితరులు ఉన్నారు. డిచ్పల్లి మండలంలోని రాంపూర్ గ్రామ పద్మశాలీ సంఘం సభ్యులు 50 మంది బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆర్టీసీ చైర్మన్ గోవర్ధన్ సమక్షంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చెవుల మల్లయ్య బీఆర్ఎస్లో చేరగా.. ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే క్యాపు ప్రాంగణంలో బీఆర్ఎస్ నూతన సంవత్సర క్యాలెండర్లను బాజిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..మతోన్మాదంతో రాజకీయం చేయాలనుకునే బీజేపీ నాయకుల మనోగతాలను దేశంలోని అన్ని వర్గాల ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీకే అన్నివర్గాల ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఎనిమిందేడ్ల కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీలేదన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి అన్ని రాష్ర్టాల నుంచి ఆదరణ లభిస్తుందని చెప్పారు. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించడంతో ముఖ్యంగా బీజేపీ నాయకుల్లో దడ మొదలైందన్నారు.
ఇక తమ పార్టీకి మనుగడ కరువవుతుందేమోనన్న ఆందోళనతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అకారణంగా కుట్ర పన్ని సీబీఐ దాడులను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆయన మండిపడ్డారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్మోహన్, దాసరి ఇందిరా లక్ష్మీనర్సయ్య, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, పార్టీ డిచ్పల్లి మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్రెడ్డి, ఇందల్వాయి ఎంపీపీ రమేశ్నాయక్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ నారాయణరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు దండుగుల సాయిలు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు విఠల్నాయక్, తెలంగాణ మాలమహానాడు రూరల్ నియోజకవర్గ అధ్యక్షు డు నీరడి రామరాజు, నాయకులు నల్లవెల్లి సాయిలు, యూత్ అధ్యక్షుడు అమీర్, దూస్గాం గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చిన్నబాలయ్య, రాయ లిం గయ్య, బీఆర్ఎస్ దూస్గావ్ గ్రామశాఖ అధ్యక్షుడు సతీశ్రెడ్డి, అమీర్, గిరీశ్కుమార్, సురేశ్, రవిగౌడ్, కొండా మురళి శంకర్, బీఆర్ఎస్ పార్టీ ఇందల్వాయి మండల బాధ్యుడు చిలువేరి గంగదాసు, సీనియర్ నాయకులు రఘు, సర్పంచ్ లలితా దాస్, పీఏసీఎస్ డైరెక్టర్ గంగారెడ్డి, ఎంపీటీసీ చింతల దాస్, సుధీర్, పార్టీ ఇందల్వాయి గ్రామశాఖ అధ్యక్షుడు భూమయ్యచ కిష్టయ్య, నరేశ్, శ్రీనివాస్, గంగాధర్ ఉన్నారు.