కంఠేశ్వర్, ఏప్రిల్ 15: ఎన్నికల సంఘం నియమ, నిబంధనలను తప్పకుండా పాటించాలని, ఎన్నికల నిర్వహణలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నిజామాబాద్ అర్బన్, రూరల్,బోధన్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల ,కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల సహాయ రిటర్నింగ్ ఆఫీసర్లు, సంబంధిత అధికారులతో నిజామాబాద్ లోక్సభ ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు.ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 18న విడుదల కానున్నదని, ఆ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లనూ పక్కాగా పరిశీలించుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ అంకిత్, మున్సిపల్ కమిషనర్ మకరంద్, అధికారులు పాల్గొన్నారు.