ఖలీల్వాడి, డిసెంబర్ 10 : అయ్యప్ప మాలధారులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. రాష్ట్రంలోని అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలకు సురక్షితంగా వెళ్లి రావడానికి అనువుగా భక్తుల కోసం రాయితీపై ప్రత్యేక బస్సులను సమకూరుస్తున్నామని ఆర్టీసీ చైర్మన్, రూరల్ శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ శని వారం ఒక ప్రకటనలో వెల్లడించారు. టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో అనుభవజ్ఞులైన డ్రైవర్లతో సురక్షితంగా ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. శబరిమల యాత్ర బస్సు లపై ఎలాంటి డిపాజిట్ లేకుండా 10 శాతం రాయితీపై సూపర్ లగ్జరీ, డీలక్, ఎక్స్ప్రెస్ బస్సులను సమకూర్చామని తెలిపారు.
ఇద్దరు గురుస్వాములు, ఇద్దరు వంట మను షులు, 12 సంవత్సరాలలోపు మాలధారులు, ఒక అటెండర్కు అదనపు సీట్లలో ఉచి తంగా ప్రయాణం కల్పిస్తున్నామని తెలిపారు. శబరిమల యాత్ర బస్సును బుక్ చేసుకున్న గురుస్వామికి ప్రయాణం ఉచితమ ని, టీఎస్ ఆర్టీసీ వారి ప్రత్యేక బస్సుల్లో ఆడియో, వీడియోతో పాటు మొబైల్ చార్జింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని వివరించారు. మాలధారులు కోరుకున్న ప్రదే శం నుంచి దర్శించాల్సిన పుణ్యక్షేత్రాల వరకు బస్సును నడుపుతారని పేర్కొన్నారు. ముం దస్తు సీట్ల రిజర్వేషన్ కోసం, శబరిమల యాత్రకు కావాల్సిన బస్సు అద్దె బుకింగ్ల కోసం www.tsrtconline.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. అడ్వాన్స్ బుకింగ్పై 10 శాతం రాయితీ ఉంటుందని, మరిన్ని వివరాలకు టీఎస్ ఆర్టీసీ కాల్ సెంటర్ 040 23450033, 6944 0000 నంబర్లను సంప్రదించాలని సూచించారు.