ఇందల్వాయి, మే 29: మండలంలోని గౌరారం గ్రామ ఉపసర్పంచ్ గోద స్వామి సోమవారం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆయనకు బాజిరెడ్డి గోవర్ధన్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉప సర్పంచ్తోపాటు గ్రామానికి చెందిన ముదిరాజ్, గంగపుత్ర కులస్తులు పార్టీలో చేరినట్లు ఎంపీటీసీ మలావత్ జమున పరశురాం తెలిపారు.
పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని ఆర్టీసీ చైర్మన్ అన్నారు. మండలంలోని లింగాపూర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జిల్లా అశోక్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సాంబారి దత్తు, ఏసాల దాసు తదితరులు పాల్గొన్నారు.