గాంధారి, జనవరి 16: పొగమంచు కమ్మేయడంతో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు రోడ్డు కిందకు దూసుకెళ్లిన ఘటన గాంధారి మండలంలోని గుడిమెట్ గ్రామ సమీపంలో చోటు చేసుకున్నది. స్థానికులు, ఆర్టీసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బాన్సువాడ డిపోకు చెందిన బస్సు సోమవారం తెల్లవారుజామున బాన్సువాడ నుంచి కామారెడ్డికి బయల్దేరింది. గాంధారి మండలంలోని గుడిమెట్ గ్రామ సమీపంలో ఉదయం 5.30గంటలకు భారీగా పొగమంచు కురియడంతో రోడ్డు సరిగా కనిపించకపోవడంతో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్ల్లింది. బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉండడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.