నిజాంసాగర్, మార్చి 31: నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి (2024-25)లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఫలితాలు విడుదలైనట్లు ప్రిన్సిపాల్ సత్యవతి తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 6వ తరగతిలో ప్రవేశాల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5,252 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. జనవరి 20 నిర్వహించిన పరీక్షకు 3728 మంది హాజరైనట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఫలితాలు ఆదివారం విడుదల చేసినట్లు చెప్పారు. ఫలితాల కోసం httpps://cbseit.in/cbse/2024/NVS-RST/Result.aspx లింకుపై క్లిక్ చేసి అడ్మిట్ కార్డు నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు నమోదు చేసి ఫలితాలు చూసుకోవచ్చని ఆమె సూచించారు.