రుద్రూర్ ఆగస్టు 31 : రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఎక్కడా లేని విధంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నదని.. కొంతమంది ఓర్వలేక ఆటంకం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని.. అప్రమత్తంగా ఉండాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నా రు. రుద్రూర్ మండలంలోని అంబం గ్రామ పంచాయతీ పరిధిలో గల లక్ష్మీపూర్ క్యాంపు, అంబం, కొందాపూర్లో రూ.3.50 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా వర్ని నుంచి కార్యకర్తలు ద్విచక్ర వాహనాలతో స్పీకర్కు స్వాగతం పలికారు. లక్ష్మీపూర్ క్యాంపులో సీసీ రోడ్లు, అంబం పాఠశాలలో అదనపు తరగతి గదులు, యాదవ, ముదిరాజ్, పెర్క సంఘ భవనాలను, ఎస్సీ కమ్యూని టీ హాల్, హెల్త్ సెంటర్, డబుల్బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. అనంతరం కొందాపూర్ గ్రామం లో పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం హనుమాన్ ఆలయం వద్ద హాలు, కమ్యూనిటీ హాలు, ప్రహరీ, డబుల్బెడ్రూం ఇంటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొందాపూర్లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. వర్ని నుంచి తగిలేపల్లి, అంబం, కొందాపూర్, కోటగిరి వరకు రోడ్డు వెడల్పు కోసం నిధులు మంజూరు చేయిస్తామని తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యధిక పింఛన్లు మన రాష్ట్రంలో ఇస్తున్నామన్నారు. అంబంలో నిర్మించిన పల్లె దవాఖానలో డాక్టర్, ఏఎన్ఎంను నియమిస్తామన్నారు. అంబం గ్రామంలో నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్ల కాలనీకి దివంగత సాయిలు పేరును పెట్టాలని సూచించారు.
మారుమూల గ్రామమైన కొందాపూర్లో ఇంతటి అభివృద్ధి చేస్తున్న స్పీకర్ పోచారం వెంటే ఉంటామని గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్కు తీర్మాన కాపీని అందజేశారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ గ్రామంలో డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించుకోలేని నిరుపేదలెవరైనా ఉంటే గృహలక్ష్మి పథకం కింద మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కొందాపూర్ను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశామని.. ఈ సందర్భంగా గ్రామస్తులకు శుభవార్త తెలిపారు. గ్రామస్తుల విన్నపం మేరకు హనుమాన్ ఆలయ ప్రహరీకి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులంతా సంతోషం వ్యక్తంచేశారు.
కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్, జడ్పీటీసీ నారోజి గంగారాం, ఎంపీపీ అక్కపల్లి సుజాతా నాగేందర్, వైస్ ఎంపీపీ సాయిలు, కోఆప్షన్ సభ్యుడు మస్తాన్, సర్పంచ్ కోర్వభాగ్యా భూషణ్, ఉపసర్పంచ్ ఘన్శ్యాం, ఎంపీటీసీ మంత్రి లక్ష్మీగంగారాం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, విండో మాజీ చైర్మన్ పత్తి రాము, పట్టెపు రాములు, హౌసింగ్ డీఈ నాగేశ్వర్రావు, ఎంపీడీవో బాలగంగాధర్, తహసీల్దార్ వెంకటేశ్, రాజయ్య, బాలకృష్ణ, రవి, సాయిలు, పోశెట్టి, సాయిలు, భాగ్య, రోజా, నరేందర్, లక్ష్మణ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.