నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 6 : కుమారుడికి పెండ్లి ఖర్చుల దొంగతనాలకు పాల్పడి చివరకు ఓ మహిళ రైల్వే పోలీసులకు చిక్కింది. మంగళవారం నిజామాబాద్ రైల్వే పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైల్వే ఎస్సై ప్రణయ్ వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన అంజనా బాయి అశోక్ హాత్గడే అనే మహిళ నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్లో దేవగిరి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కుతున్న ఓ మహిళ హ్యాండ్ బ్యాగులోంచి నగలు, నగదు దొంగిలించింది.
ఈ చోరీ సంఘటనపై బాధితురాలు నల్ల అభినేత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, గాలింపు చేపట్టారు. మంగళవారం మళ్లీ అంజనాబాయి నిజామాబాద్ రైల్వే స్టేషన్కు రావడంతో అదుపులోకి తీసుకొని విచారించినట్లు ఎస్సై వివరించారు. దీంతో అంజనాబాయి తాను చేసిన దొంగతనాన్ని అంగీకరించడం తో కేసు నమోదు చేసి, 77 గ్రాముల బంగారు నగల తో పాటు రూ.50 వేలు నగదు స్వాధీనం చేసుకున్న ట్లు ఎస్సై వెల్లడించారు. ఈ నెల 8వ తేదీన కుమారు డి పెండ్లి ఉందని, ఖర్చుల కోసం మళ్లీ దొంగతనం చేసేందుకు నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఈ రోజు రావడంతో ఆమెను పట్టుకున్నట్లు ఎస్సై ప్రణయ్ తెలిపారు.