వేల్పూర్: వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు గ్రామానికి చెందిన మొండి నవీన్ తన తండ్రి మొండి బాలయ్య జ్ఞాపకార్థం ఎమర్జెన్సీ బెడ్, వీల్ చైర్, సూక్ష్మ యూనిట్లను (తెమడ తీసే యంత్రం) అందజేశారు. ఈ వైద్య పరికరాలను బుధవారం దవాఖాన వైద్యుడు అశోక్కు అందజేశారు. వైద్యశాల అభివృద్ధికి సహకరిస్తున్న స్థానిక యువతను డాక్టర్ అశోక్ ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ తీగల రాధ, ఉపసర్పంచ్ పిట్ల సత్యం, ఎంపీటీసీ మొండి మహేశ్, తీగల మోహన్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.