Kotagiri | కోటగిరి, మే 29 : ఎన్నికల హామీలను కాంగ్రెస్ తుంగలో తొక్కేసిందని, వీవోఏలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించి మోసం చేసిందని బీఆర్ఎస్ మండల నాయకులు తేళ్ల రవికుమార్, సమీకుర్, మోరే కిషన్. నజీర్ పేర్కొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న వీవోఏ ల నిరవదిక సమ్మెకూ కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం సంఘీభావం తెలిపారు. వీవోఏల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు బీఆర్ఎస్ తరుపున పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.
2023 లో అసెంబ్లీ సాక్షిగా నాటి ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రి సీతక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీవోఏ ల సమస్యలపై ప్రశ్నించారని, ఆనాడు ప్రశ్నించిన సీతక్క ఇప్పుడు అదే శాఖ సంబంధించిన మంత్రి ఉన్నారని, ఆనాటి సమస్య నేడు గుర్తుకు రావడం లేదా అని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వీవోఏలకు సేర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, నెలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు ట్యాబ్ తోపాటు నెట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
అర్హులైన వారికి సీసీ లుగా ఉద్యోగోన్నతి కల్పించాలని, రూ.20 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి విశేష సేవలు అందిస్తున్న వివో ఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనియెడల బీఆర్ఎస్ తరపున ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రవికుమార్, కిషన్, నజీర్, సమీర్ , శంకర్ గౌడ్, కప్ప సంతోష్ ,యోగేష్, ఉమాకాంత్ తదితరులు ఉన్నారు.