నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 6: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న అభయహస్తం ఆరు గ్యారంటీల పథకాల కోసం ఏర్పాటు చేసిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం శనివారం ముగిసింది. నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్పూర్, మహ్మద్నగర్ మండలంలోని తెల్గాపూర్, బూర్గుల్ గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమాలు కొనసాగాయి. తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీవో నాగేశ్వర్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. సుల్తాన్నగర్లో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు రవీందర్గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ మల్లికార్జున్, నాయకులు ఆకాశ్, సాయిలు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని పలు వార్డులతోపాటు మండలంలోని దాల్మల్కాపల్లి, సబ్దల్పూర్, కొక్కొండ గ్రామాల్లో ఆరు గ్యారంటీల దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ఎల్లారెడ్డి ఎంపీపీ మాధవి, ఎంపీవో ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపు తండా, జక్కల్దాని తండా, చిన్నరాంపూర్, రాంపూర్తండా, గ్రామాల్లో అధికారులు దరఖాస్తులను స్వీకరించారు.
నోడల్ అధికారులు తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో సత్యనారాణ, సర్పంచులు నాన్కుబాయి, లలిత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బాన్సువాడలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలను కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏనుగు రవీందర్రెడ్డి పరిశీలించారు. ఆయన వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. నస్రుల్లాబాద్ మండలం లింగంపల్లి తండా, బస్వాయిపల్లి, బీర్కూర్ మండలం రైతు నగర్లోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. తహసీల్దార్లు రాజు, జనార్దన్, ఎంపీడీవోలు సుబ్రహ్మణ్యం, భాను ప్రకాశ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. రాజంపేట్లోని తహసీల్ కార్యాలయాన్ని ఆర్టీవో శ్రీనివాస్రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన దరఖాస్తులను పకడ్బందీగా ఆన్లైన్లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. రెవెన్యూకు సంబంధించిన విషయాలపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ సాయిబాబా, తహసీల్దార్ అనిల్కుమార్, డిప్యూటీ తహసీల్దార్ సంతోషి, ఎంపీవో రఘురాం, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. బీబీపేట్, కామారెడ్డి రూరల్, దోమకొండలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ముగిసింది. చాలా చోట్ల ప్రజా ప్రతినిధులు, అధికారులు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ పస్తం యాదమ్మ పరశురాం, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.