నిజామాబాద్ రూరల్ : రూరల్ నియోజకవర్గంలో ఇటీవల కొత్తగా నియామకమైన టీఆర్ఎస్ మండల, గ్రామ కమిటీల సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి సమన్వయంతో ముందుకు సాగాలని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. శుక్రవారం రూరల్ క్యాంప్ కార్యాలయంలో నిజామాబాద్ మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు మల్లేశ్, సిరికొండ, డిచ్పల్లి, మోపాల్, ఇందల్వాయి మండలాల నూతన టీఆర్ఎస్ కమిటీ సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు బాజిరెడ్డిని శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ మాత్రమే బలోపేతమై ఉందని అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలుగా శ్రమిస్తున్నారని చెప్పారు.
ప్రజల గుండెల్లో నాటుకుపోయి ఉన్న టీఆర్ఎస్ పార్టీని ఎవరూ ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల నుంచి దూరం చేయలేరన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడూ ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అబద్ధం, మోసపూరితమైన మాటలతో నమ్మబలికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో పుట్టగతులుండవని వెల్లడించారు.
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎల్లప్పుడూ సీఎం కేసీఆర్కు అండగా నిలిచేలా విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. కార్యక్రమంలో ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, టీఆర్ఎస్ నాయకులు మధుకర్రావు, జలందర్గౌడ్, నరేశ్, శ్రీనివాస్ రెడ్డి, పవన్, భూమేశ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.