ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మండల కేంద్రాల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు సోమవారం ప్రారంభమయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే ఆరు గ్యారెంటీల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. బిచ్కుంద ఎంపీడీవో కార్యాలయంలో ఇన్చార్జి ఎంపీడీవో గోపాల్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
– బిచ్కుంద, మార్చి 4