కామారెడ్డిలో 93.99, నిజామాబాద్లో 91 శాతం హాజరైన విద్యార్థులు
విద్యానగర్/ఇందూరు, జూన్ 30 : ఉమ్మడి జి ల్లాలో గురువారం పాలిసెట్ ప్రశాంతంగా జరిగిం ది. ఈ పరీక్ష ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో ఏడు, నిజామాబాద్లో 21 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కామారెడ్డిలో 2,812 మంది విద్యార్థులకు 2, 643 మంది హాజరుకాగా, 169 మంది గైర్హాజరైన ట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కిష్టయ్య తెలిపారు. ఇందులో బాలురు 1335, బాలికలు 1308 మంది ఉన్నారని, హాజరు 93. 99 శాతం నమోదైనట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ జితేశ్ పాటి ల్ తనిఖీ చేశారు. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుడు అరవింద్ మెంటార్గా, గంగాధర్ ప్రత్యేక పరిశీలకుడిగా పర్యవేక్షించారు. అన్ని కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పా టు చేశారు. నిజామాబాద్ జిల్లాలో పాలిసెట్కు మొత్తం 7008 మంది విద్యార్థులకు 6389 మంది హాజరు కాగా 619 మంది గైర్హాజరైనట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీరాంకుమార్ తెలిపారు. హాజరు 91 శాతం నమోదైనట్లు పేర్కొన్నారు.