వినాయక నగర్,మార్చి 28 | నిజామాబాద్ నగర శివారులో శుక్రవారం మధ్యాహ్నం దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళను హత్య చేసి మృతదేహాన్ని కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ రూరల్ పరిధికి చెందిన కమల (50 )ను గుర్తు తెలియని వ్యక్తులు ఎక్కడో హత్య చేశారు. అనంతరం ఆమె డెడ్ బాడీని ఓ కారు వెనుక డిక్కిలో వేసుకొని కంటేశ్వర్ బైపాస్ రోడ్డు నుండి వెళ్తుండగా రూరల్ పోలీసులు గుర్తించి పట్టుకున్నారు.
అయితే కారులో ఉన్న వ్యక్తులు పరాలైనట్లు తెలిసింది. మహిళను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, కారణాలు ఏమిటి అని ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. మహిళ డెడ్ బాడీని తరలిస్తున్న కారును పోలీసులు సీజ్ చేశారు.