నిజామాబాద్ నగరంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మంగళవారం పలుచోట్ల వాహనదారులను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి సంబంధించిన పత్రాలను పరిశీలించారు. నిబంధనలు పాటించని వారికి జరిమానా విధించారు.
కంఠేశ్వర్, ఎల్లమ్మగుట్ట మధ్య రెండు చోట్లా తనిఖీలు చేపట్టడంతో పండుగ వేళ వాహనదారుల సమయం వృథా అయ్యింది. పూజ సామగ్రి కొనుగోలు చేసేందుకు మార్కెట్కు వెళ్లే హడావుడిలో సంబంధిత పత్రాలు వెంట తెచ్చుకోలేదని చెప్పినా వినిపించుకోలేదని కొందరు ఆవేదన వ్యక్తంచేశారు.
-వినాయక్నగర్, ఏప్రిల్ 9