బాల్కొండ, జనవరి10 : డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్మించిన నూతన పోలీసు భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మంజూరు చేయించిన నూతన ఫర్నీచర్ను పరిశీలించారు. జిల్లాలో ఎక్కడా డ్రగ్స్ సరఫరా జరిగినా, వినియోగించినట్లు తెలిసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత డ్రగ్స్కు బానిస కాకుండా ఉండాలని సూచించారు.
పోలీసు సిబ్బంది ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసుగా వ్యవహరిస్తూ డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. ప్రజలు పండగలకు, సెలవులకు వెళ్లేవారు స్థానిక పోలీస్స్టేషన్లో సమాచారం అందించాలని సూచించారు. ప్రజలకు ఏదైనా సమస్యలు వెంటనే 100కు సమాచారం అందించాలన్నారు. సీపీ వెంట ఏసీపీ ప్రభాకర్రావు, ఎస్సై గోపి, ఏఎస్సై రాజేశ్వర్రెడ్డి, ఉపసర్పంచ్ వాహెబ్, పోలీసు సిబ్బంది సతీశ్, పవన్ తదితరులు ఉన్నారు.