బాన్సువాడ, నవంబర్ 4 : ఎన్నికలు వచ్చాయని, పూటకో పార్టీవాళ్లు వచ్చి మోచేతికి బెల్లం పెట్టి, లేని పోని మాటలు చెప్పి నమ్మబలుకుతారని.. కాంగ్రెస్, బీజేపీ వాళ్లను నమ్మితే రాష్ర్టాన్ని, దేశాన్ని అమ్మేస్తరని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నా రు. బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. బీర్కూర్ తండా, కిష్టాపూర్, చించోల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పదేండ్ల కాలంలో చేసిన అభివృద్ధి పనులు, గ్రామాలకు కేటాయించిన నిధుల వివరాలను పోచారం శ్రీనివాసడ్డి ప్రజలకు వివరించారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వంద శాతం పూర్తి చేశానన్నారు. రాజకీయంగా ఇదే తన చివరి ఎన్నికలు అని, మీరందరూ మంచి మనస్సుతో ఆశీర్వదించి ఈ నెల 30న జరిగే పోలింగ్ కేంద్రాల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని స్పీకర్ పోచారం విజ్ఞప్తి చేశారు. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, బీర్కూర్ ఎంపీపీ రఘు, జడ్పీటీసీ స్వరూపాశ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, ఏఎంసీ మాజీ చైర్మన్ అశోక్, ఎంపీటీసీ సందీప్ పటేల్, వైస్ ఎంపీపీ కాశీరాం, దుంపలపల్లి రాజు, మండల యువజన విభా గం అధ్యక్షుడు శశికాంత్, భాను ప్రశాంత్గౌడ్, రాంబాబు, బాబు, శ్రీనివాస్, సాయిలు, అంబయ్య, లాడేగాం గంగా రాం, అంజాగౌడ్, మండల కోఆప్షన్ సభ్యుడు ఆరిఫ్, మన్నన్, వెంకట్రెడ్డి, హైమద్, ప్రదీప్ పంతులు ఉన్నారు.
బీఆర్ఎస్ నాయకుల ఇంటింటా ప్రచారం
బాన్సువాడలో ఎగిరేది గులాబీ జెండానే అని, బాన్సువాడ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని బీఆర్ఎస్ శ్రేణులు, ఎత్తొండ సర్పంచ్ సిరిగిరి సాయిబాబా, ఉప సర్పంచ్ సుజాతాదేవేందర్, ఆనంద్, హన్మంతు అన్నా రు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కోటగిరితోపాటు మండలం ఎత్తొండలో గ్రామంలో గడప గడపకూ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటువేసి పోచారం శ్రీనివాసరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఫారూఖ్, వెంకటేశ్, సర్పంచ్ పత్తి లక్ష్మణ్, అనిల్ కులకర్ణి, కూచి సిద్ధు, గజేందర్, సాయిబాబా, ఆకుల పోశెట్టితోపాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ బాన్సువాడ మండలంలోని వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎంపీపీ దొడ్ల నీరజ, జడ్పీటీసీ పద్మ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు మోహన్నాయక్, రాజేశ్వర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ నెర్రె నర్సింహులు, బోర్లం, బుడ్మి సొసైటీ అధ్యక్షులు గంగుల గంగారాం, సంగ్రాం నాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండా గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు జోరుగా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నస్రుల్లాబాద్ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, ఎంపీపీ పాల్త్య విఠల్, సర్పంచ్ బద్యా, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రాము, విండో వైస్ చైర్మన్ అరుణ్, నాయకులు ప్రతాప్సింగ్, మోహన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్ మండలం చిక్కడ్పల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామాధ్యక్షుడు మోహన్, ఉపసర్పంచ్ నరేందర్, సీనియర్ నాయకులు హన్మంతు, మక్కయ్య, రాజయ్య, నక్క గంగాధర్, సాయిలు, పరమేశ్, సోషల్మీడియా కన్వీనర్ లాల్మహ్మద్, భీమయ్య తదితరులు ఉన్నారు.