తాడ్వాయి, జనవరి 29 : మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాట్రాల మల్లయ్య(40) అనే వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై ఆంజనేయులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని దేవాయిపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య బైక్పై తాడ్వాయికి వచ్చి పనులు ముగించుకుని తిరుగు పయనం అయ్యాడు.
కామారెడ్డి వైపు నుంచి వస్తున్న డీసీఎం డ్రైవర్ శబరిమాతాజీ ఆశ్రమం ఎదుట గల పెట్రోల్ పంపులోకి అతివేగంగా మలుపడంతో ఎదురుగా వస్తున్న మల్లయ్య బైక్ను ఢీ కొట్టాడు. దీంతో మల్లయ్య ముఖం, తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా దవాఖానకు తరలించారు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు.