బాల్కొండ, డిసెంబర్ 4: ఈనెల 7న జగిత్యాల జిల్లా మోతెలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలు తరలిరావాలని ఎంపీపీ లావణ్య లింగాగౌడ్, జడ్పీటీసీ దాసరి లావణ్యా వెంకటేశ్ కోరారు. మండల కేంద్రంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్రెడ్డి అధ్యక్షతన కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుందని, రైతులు, యువకులు, పార్టీ శ్రేణులు, ప్రజలు తరలిరావాలని కోరారు. సమావేశంలో వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ నాగులపల్లి రాజేశ్వర్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు ఆకుల నరేందర్, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు సాగర్ యాదవ్, సర్పంచులు నోముల రవి, గోవర్ధన్గౌడ్, నాగులపల్లి కిషన్, గడ్చందా అనిల్, కర్రె గంగయ్య, పస్తం చిన్నరాజన్న, ఎంపీటీసీలు కన్న పోశెట్టి, ఈపీ నారాయణ, సనుగుల శ్యాంసుందర్, కోటగిరి శ్రీకాంత్చారి, నోముల మోహన్, ఎంబరి మహిపాల్, చించు శ్రీనివాస్గౌడ్, పస్తం చిన్నరాజన్న, ఎంపీటీసీలు కన్న పోశెట్టి, ఈపీ నారాయణ, సనుగుల శ్యామ్సుందర్, కోటగిరి శ్రీకాంత్చారి, నోముల మోహన్, ఎంబరి నర్సయ్య, న్యావనంది సాయన్న, ఎనుగందుల శ్రీనివాస్, గడ్చందా ప్రదీప్, తోట వంశీ, వేంపల్లి పెద్దబాల్రాజేశ్వర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వేంపల్లి చిన్నబాల్రాజేశ్వర్ పాల్గొన్నారు.
ఈనెల 7న జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు గుల్లే రాజేశ్వర్ కోరారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని టీఆర్ఎస్(బీఆర్ఎస్) కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజపూర్ణానందం అధ్యక్షతన ఆదివారం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో సొసైటీ చైర్మన్లు బర్మ చిన్న నర్సయ్య, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు నేరెళ్ల లింగరెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ సున్నపు అంజయ్య, సర్పంచులు గుల్లే లావణ్య గంగాధర్, నవీన్, పత్తిరెడ్డి ప్రకాశ్ రెడ్డి, భీమనాతి భానుప్రసాద్, కట్కం పద్మాసాగర్, పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు గంగారాం నాయక్, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అంజిరెడ్డి, దేవన్న యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షుడు తుపాకుల శ్రీనివాస్గౌడ్, పార్టీ మండల నాయకులు శ్రీనివాస్రెడ్డి, బిగ్బాస్ గంగారాం, దేవేందర్, చిలుక కిషన్ పాల్గొన్నారు.