జిల్లావ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలను ప్రజలు శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. వైష్ణవ ఆలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివార్లను దర్శనం చేసుకున్నారు. అర్చకుల ఆధ్వర్యంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు కొనసాగాయి. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.