కామారెడ్డి, ఫిబ్రవరి 9: జిల్లాలో పారిశ్రామిక, ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖల పెండింగ్ రుణాలు తక్షణమే ఇవ్వాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఆదేశించారు. డిసెంబర్ 22-23 త్రైమాసికానికి నిర్దేశించుకున్న వార్షిక రుణ ప్రణాళిక రూ.4,700 కోట్లు కాగా, ఇప్పటి వరకు 3,023 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు.కామారెడ్డి కలెక్టరేట్లో కెనరా బ్యాంక్ జిల్లా లీడ్ ఆఫీస్ ఆధ్వర్యంలో గురువారం రుణాల వితరణ పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ రుణాలు రూ. 1434 (52.0) కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 544 (63.38 శాతం)కోట్లు మాత్రమే ఇచ్చినట్లు తెలిపారు. ఆశించిన స్థాయిలో రుణాలు అందడంలేదన్నారు. అనంతరం సదాశివనగర్, లింగంపేట్ మం డల సమాఖ్యలకు చేపల పెంపకం యూనిట్ల కోసం నాబార్డ్ కింద రూ.10 లక్షల చొ ప్పున 100 శాతం రాయితీ పత్రాలను మహిళా సమాఖ్య ప్రతినిధులకు కలెక్టర్ అందజేశారు.
సమావేశంలో జిల్లా శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ శ్రీనివాసరావు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి అలీ బాబా,నాబార్డ్ డీడీఎం నగేశ్, ఎల్డీఎం చిందం రమేశ్, డీఆర్డీవో సాయన్న, జిల్లా వ్యవసాయ పశుసంవర్ధక శాఖల అధికారులు భాగ్యలక్ష్మి, డాక్టర్ శరత్, మెప్మా పీడీ శ్రీధర్రెడ్డి, డీపీఎంలు రమేశ్ బాబు, రవీందర్, వివిధ బ్యాంకుల మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.