మాక్లూర్, నవంబర్ 24 : మండలంలోని ముల్లంగి(బీ) గ్రామంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు బడుగు సత్యం ఆధ్వర్యంలో పార్టీ బూత్ కమిటీలను గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఎన్నికైన సభ్యులకు ఆయన నియామక పత్రాలను అందజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ బూరోల్ల అశోక్, పార్టీ నాయకులు కె. శ్యామ్రావు, మేడే గోపాల్, లక్ష్మణ్, గంగాధర్, భోజన్న, సాయిలు, రమణ, జైనుద్దీన్ పాల్గొన్నారు.