వేల్పూర్ , ఆగస్టు 10: కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా బాల్కొండ నియోజకవర్గంలోని మెం డో రా మండలం కొడిచెర్ల గ్రామానికి చెందిన సు మారు 50 మంది యువకులు బీజేపీకి రాజీనా మా చేసి రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసన సభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో గురువారం బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో యోగేశ్, శశికరణ్, సాయిరెడ్డి, రాజు, సన్నిత్, నవీన్, రాజేశ్తోపాటు పలువురు యువకులు ఉ న్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ మండల కన్వీనర్ శేఖర్రెడ్డి, వైస్ ఎంపీపీ సర్వసతీ రవీందర్ గౌడ్, ఉప సర్పంచ్ ఎట్టెడి సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీబీపేట్, ఆగస్టు 10: బీబీపేట్ మండల కేంద్రానికి చెందిన మాజీ జడ్పీటీసీ బాయికాడి బాలయ్యతోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమక్షంలో గురువారం బీఆర్ఎస్లో చేరారు. వారికి ప్రభుత్వ విప్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాజీ సభ్యుడు బాయికాడి బాలయ్యతో పాటు పలువురు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్కుమార్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీపీ బాలమణి, మండల అధ్యక్షుడు వెంకట్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.