నిజామాబాద్ : ట్రక్కు ఢీకొన్న దుర్ఘటనలో ఆయుర్వేద మందుల విక్రేత మృతిచెందగా అతడి భార్య, ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. ఈ విషాద సంఘటన బోధన్-నిజామాబాద్ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. బాధితుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. చింతల అర్జున్ (30) అనే వ్యక్తి తన మోపెడ్పై గ్రామాల్లో తిరుగుతూ ఆయుర్వేద మందులు విక్రయిస్తాడు. ఆదివారం అతను తన మోపెడ్పై భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బోధన్ నుండి నిజామాబాద్కు వెళ్తున్నాడు.
ఈ క్రమంలో యెడపలి మండలం సతాపూర్ గేట్ వద్ద ఓ ట్రక్కు వచ్చి వీరి వాహనాన్ని వెనుక నుండి ఢీకొట్టింది. దీంతో అర్జున్ మోపెడ్ నుండి కిందపడగా ట్రక్ అతనిపై నుండి దూసుకెళ్లింది. అర్జున్ అక్కడికక్కడే మృతిచెందగా భార్య, పిల్లలు స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. యడపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రక్కు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి బాధిత కుటుంబాన్ని బోధన్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.