ధర్పల్లి/ సిరికొండ, ఫిబ్రవరి 26: సాగు నీరందక ఎండిపోతున్న పంటలపై నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ధర్పల్లి, సిరికొండ మండలాల్లో వ్యవసాయ అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ధర్పల్లి మండలంలోని దుబ్బాక, రేకులపల్లి, సిరికొండ మండలంలోని హుస్సేన్నగర్ గ్రామాల్లో ఎండిన పంటలను ఏడీఏ ప్రదీప్ వ్యవసాయాధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొలాలకు నీరందక ఎండిపోయినది వాస్తవమేనని, భూగర్భజలాలు అడుగంటి పోవడంతో బోర్లలో నీరు రాక పంటలు ఎండిపోయాయన్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, బాధితులకు పరిహారం అందేలా చూస్తామన్నారు. వారి వెంట ఏఈవో మనోజ్, రైతులు ఉన్నారు.