విద్యానగర్, డిసెంబర్ 5 : కేసుల పరిష్కారంలో అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కోర్టులో ఉన్న కేసుల పురోగతిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అసి స్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్తో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వారీగా పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాటి పురోగతిపై సమీక్ష నిర్వహించారు. క్రిమినల్, సివిల్, ఎక్సైజ్, అటవీ, మున్సిపాలిటీ తదితర శాఖ ల కేసుల వివరాలపై ఆరా తీశారు. త్వరితగతిన పరిష్కరిం చాలని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్రెడ్డి, అద నపు కలెక్టర్ చంద్రమోహన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
పనిచేసే చోట మహిళా ఉద్యోగులు వేధింపులకు గురైతే మహిళా హెల్ప్లైన్ 181 నంబర్కు ఫోన్ చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సఖి కేంద్రం, వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న వేధింపుల నివారణపై సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో మహిళలు, బాలికలు మానసిక, శారీరక హింసలకు గురైతే షీ టీమ్స్కు సమాచారం అందిస్తే అవసరమైన సహకారం లభిస్తుందని తెలిపారు. బాధిత మహిళలు మానసిక, శారీరక సమస్యలతో సఖీ కేంద్రానికి వెళ్తే కౌన్సెలింగ్ ఇచ్చి మనోధైర్యాన్ని కల్పిస్తుందని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. ఆడపిల్లల అమ్మకం, అక్రమ రవా ణా జరిగితే పోలీసు శాఖకు సమాచారం అందించాలన్నా రు. కార్యక్రమంలో ఆర్టీవో వాణి, ప్రతినిధులు స్వర్ణలత, పోశవ్వ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కామారెడ్డిలోని నూతన కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేసి పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణిలో భూ సమస్యలు పరిష్కరించాలని వచ్చే ఫిర్యాదులను అధికారులు తక్షణమే పరిష్కరించాలన్నారు. రెవెన్యూకు 49, డీఎంహెచ్వోకు ఒకటి, డీపీవోకు ఐదు, మున్సిపల్కు ఆరు, డీఈవోకు ఒకటి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ఒకటి, ఎస్సీ డెవలప్మెంట్కు ఒకటి, ఎస్సీ కార్యాలయానికి ఒకటి, ఆర్టికల్చరల్ డిపార్ట్మెంట్కు ఒక ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో జడ్పీ సీఈవో సాయాగౌడ్, జిల్లా అధికాలు పాల్గొన్నారు.