డిచ్పల్లి/ధర్పల్లి/నిజామాబాద్ రూరల్/కోటగిరి/ చందూ ర్/ సిరికొండ/మోపాల్ (ఖలీల్వాడి), మే 23 : కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు కరోనా నియంత్రణకు చేపట్టిన లాక్డౌన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. డిచ్పల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం మాంసం, చికెన్ దుకాణాలు, కూరగాయల మార్కెట్లలో ప్రజలు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. టిఫిన్ సెంటర్లలో కేవలం పార్సిళ్ల పద్ధతిని అమలు చేశారు. ధర్పల్లిలో తహసీల్దార్ జయంత్రెడ్డి, ఎంపీడీవో నటరాజ్, ఇన్చార్జి ఎస్సై నరేశ్ ప్రతి షాపు వద్దకు వెళ్లి సూచనలు చేశారు. షాపుల వద్దకు వచ్చే ప్రజలు గుమిగూడకుండా భౌతికదూరం పాటించేలా చూడాలన్నారు. సున్నంతో గుండాలు వేయించాలని షాపు యజమానులకు సూచించారు. ప్రతిరోజు ఇలాగే కొనసాగిస్తే మండలంలో కరోనా కేసులనేవి ఉండవని ఈ సందర్భంగా వారు ప్రజలకు సూచించారు. వారి వెంట స్థానిక సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాల్రాజ్, కార్యదర్శి సైఫుద్దీన్, సిబ్బంది తదితరులు ఉన్నారు.
దుకాణాల వ్యాపారులు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు కరోనా నిబంధనలను విధిగా పాటించాలని నిజామాబాద్ రూరల్ ఎంపీడీవో మల్లేశ్ సూచించారు. ఆదివారం మండలంలోని వివిధ గ్రామాల్లో దుకాణాలను ఆయన సందర్శించారు. ఎంపీడీవో వెంట గుండారం సర్పంచ్ లక్ష్మణ్రావు, కార్యదర్శి సుధాకర్రెడ్డి, వీడీసీ చైర్మన్ ఉమాపతి తదితరులు ఉన్నారు. కోటగిరి మండల కేంద్రంలో ఇన్చార్జి ఎస్సై రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేయడంతో పాటు జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది రాజేందర్, సురేశ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
చందూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ వసంత, ఎంపీడీవో నీలావతి దుకాణదారులు, వినియోగదారులకు కొవిడ్ నిబంధనలను పాటించాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దుకాణాల ఎదుట భౌతిక దూరం పాటించేలా గుండాలను గీయించారు. వారి వెంట ఎంపీపీ తారాచంద్, సిబ్బంది తదితరులు ఉన్నారు. పోలీసులు లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తామని ఎస్సై రాజశేఖర్ స్పష్టం చేశారు. సిరికొండ మండల కేంద్రంలో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎన్నం రాజిరెడ్డి, తహసీల్దార్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.
నిర్మానుష్యంగా రోడ్లు
మోపాల్ మండలంలో లాక్డౌన్ ప్రభావంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. మండలంలో పరిస్థితులను ఎస్సై పూర్ణేశ్వర్ సిబ్బందితో పర్యవేక్షిస్తున్నారు. ధర్పల్లి మండ లంలో లాక్డౌన్ సంపూర్ణంగా కొనసాగుతున్నది. మండ ల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో ఉదయం 10 గంటల తర్వాత ప్రజలెవరూ బయటికి రావడం లేదు.