నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 7 : జిల్లాలో పల్లెప్రగతి కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. అధికారులు, ప్రత్యేకాధికారులు విస్తృతంగా పర్యటించి పనులను పర్యవేక్షించారు.మెండోరా, ఇందల్వాయి, జక్రాన్పల్లి మండలాల్లో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా పర్యటించి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటి సంరక్షించాలని అధికారులకు సూచించారు. గ్రామపంచాయతీల కార్యదర్శులతో మాట్లాడి అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇందల్వాయి మండలంలోని తిర్మన్పల్లి, గన్నారం, దేవీతండా, చాంద్రయన్పల్లి, జక్రాన్పల్లి మండలకేంద్రంతోపాటు బాల్నగర్, సికింద్రాపూర్, చాంద్మియాబాగ్ తండా, అర్గుల్ గ్రామాల మీదుగా ఉన్న జాతీయ రహదారికి ఇరువైపులా నాటుతున్న మొక్కలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆమె వెంట ఇందల్వాయి, జక్రాన్పల్లి ఎంపీడీవోలు రాములు నాయక్, లక్ష్మణ్, ఎంపీవో సుభాష్చంద్రబోస్, ఏపీవో మంజుల, బుస్సాపూర్ సర్పంచ్ సుజాత, కార్యదర్శులు ఉన్నారు.
మాక్లూర్ మండలం గంగరమందలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు మొక్కలను పంపిణీ చేసి గ్రామ పంచాయతీ వద్ద మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల రోజులపాటు గ్రామాల్లో మొక్కలు నాటాలని సూచించారు. మురికి కాల్వల నిర్మాణానికి రూ.5లక్షలు, అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనానికి రూ.1.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సర్పంచ్ అనుగు గంగాధర్, ఉప సర్పంచ్ యాకుబ్, కేసీఆర్ సేవాదల్ జిల్లా అధ్యక్షుడు రమణారావు, ఇన్చార్జి ఎంపీడీవో శ్రీనివాస్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నగేశ్, నాగారావు, తెలంగాణ శంకర్, డాక్టర్ శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రసాద్, అంజయ్య, రాజేశ్వర్, మోహన్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
కమ్మర్పల్లిలోని కస్తూర్బా పాఠశాల ఆవరణలో పాఠశాల సిబ్బంది పండ్లు, పూల మొక్కలు నాటినట్లు పాఠశాల ప్రత్యేకాధికారిణి గంగామణి తెలిపారు. బషీరాబాద్లో రోడ్లకు ఇరువైపులా చెత్తను తొలగించి శుభ్రం చేశారు. సర్పంచ్ అశోక్ పాల్గొన్నారు. ఏర్గట్ల మండలంలో పల్లెప్రగతి పనులను ఎంపీడీవో రాజేశం, ప్రత్యేకాధికారులు మహ్మద్ అబ్దుల్ మాలిక్, సంతోష్, నవీన్, అరవింద్ పర్యవేక్షిస్తున్నారు.
రెంజల్ మండలంలో పల్లెప్రగతి పనులు కొనసాగుతున్నాయి. తాడ్బిలోలిలో మురికి కాలువలను శుభ్రం చేయించి, చెత్తను ట్రాక్టర్లతో తరలించారు. ఆర్మూర్ మండలం చేపూర్లో సర్పంచ్ సాయన్న మొక్కలను పంపిణీ చేశారు. ఉపసర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి, టీఆర్ఎస్ నాయకుడు రాజారెడ్డి పాల్గొన్నారు.
బోధన్ మండలంలోని ఎరాజ్పల్లిలో ఎంపీపీ బుద్దెసావిత్రి, జడ్పీటీసీ లక్ష్మితో కలిసి బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ మొక్కలను నాటారు. డీసీసీబీ డైరెక్టర్ గంగారెడ్డి, రైతు బంధు సమితి మాజీ కన్వీనర్ బుద్దె రాజేశ్వర్, వైస్ ఎంపీపీ గంగారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మాణిక్ వెంకట్రెడ్డి, ఎంపీడీవో సుదర్శన్నాయక్, సీఐ రవీందర్నాయక్, ఎస్సై సందీప్, టీఆర్ఎస్ నాయకులు సంజీవ్కుమార్, షకీల్, ఎరాజ్పల్లి సర్పంచ్ కృష్ణారెడ్డి, భవానిపేట్ సర్పంచ్ కృష్ణప్రసాద్, ఎంపీటీసీ వెంకటేశం, సుదర్శన్, కార్యదర్శి బాలకృష్ణ, గోపాల్ పాల్గొన్నారు.
ఎడపల్లి మండలం ఠాణాకలాన్లో సర్పంచ్ పాల్ద భాస్కర్రెడ్డి, ఎంపీటీసీ సుమలత తదితరులతో కలిసి జడ్పీ వైస్ చైర్పర్సన్ రజితాయాదవ్ మొక్కలు నాటారు.
సర్పంచ్ భాస్కర్ రెడ్డి, ఎంపీటీసీ సుమలత, ఎంపీడీవో శంకర్, ప్రత్యేకాధికారి మనోహర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నర్సయ్య, నాయకులు సుభాష్, ఎల్లయ్య యాదవ్, గ్రామస్తులు పాల్గొన్నారు. ధర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమాల్లో ఎంపీపీ నల్ల సారికాహన్మంత్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నల్ల హన్మంత్రెడ్డి పాల్గొన్నారు. కోటగిరి మండలం హంగర్గాలో కార్యదర్శి కవితతో కలిసి సర్పంచ్ సునీతావిజయ్పటేల్ మొక్కలు పంపిణీ చేశారు. ఇందల్వాయి మండలంలో పల్లెప్రగతి పనులు కొనసాగుతున్నాయి. అసంపూర్తి పనులను పూర్తి చేయాలని ఎంపీడీవో రాములునాయక్ అధికారులకు సూచించారు. వర్ని మండలం రాజ్పేట్లో గ్రామస్తులకు పెరటి మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ యమున, ఎంపీటీసీ పద్మ, గ్రామ ప్రత్యేకాధికారి విక్రం, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యుడు వసంత్ తదితరులు పాల్గొన్నారు. మోస్రా మండలంలోని 6వ నంబర్ తండాలో ఎంపీపీ పిట్ల ఉమాశ్రీరాము లు మొక్కలు నాటారు. ఎంపీడీవో భారతి, ఏపీవో రఫీక్, ఫెరోజ్ తదితరులు పాల్గొన్నారు.