ధర్పల్లి, ఏప్రిల్ 7 : కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, వైరస్ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని పద్మశాలీ సంఘ భవనంలో బుధవారం కొవిడ్ వ్యాక్సినేషన్పై మహాలక్ష్మి పిల్లల దవాఖాన ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్తోపాటు ఎంపీపీ నల్ల సారికాహన్మంత్రెడ్డి హాజరయ్యారు. జగన్ మాట్లాడుతూ ఎంతో విలువైన కొవిడ్ టీకా వేసుకోవడంలో నిర్లక్ష్యం పనికిరాదన్నారు. కార్యక్రమంలో డాక్టర్ హరికృష్ణ, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు, మండల కన్వీనర్ పీసు రాజ్పాల్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నల్ల హన్మంత్రెడ్డి, సర్పంచ్ ఆర్మూర్ పెద్ద బాల్రాజ్, వైస్ ఎంపీపీ కె.నవీన్రెడ్డి, సొసైటీ చైర్మన్ చెలిమెల చిన్నారెడ్డి, ఎంపీడీవో నటరాజ్, తహసీల్దార్ జయంత్రెడ్డి, ఐసీడీఎస్ అధికారులు, సూపర్వైజర్లు, కో-ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ మాజిద్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కొండ చంద్రశేఖర్, గోపాల్నాయక్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ సిబ్బందికి చీరలు పంపిణీ
మండలంలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, అంగన్వాడీ సిబ్బందికి సైతం చేయూతనందించిందని, వారి సంక్షేమానికి కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులతోపాటు నాయకులు, సీడీపీవో సునీత, ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీప్రియ, అధికారులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ…
రైతు సంక్షేమమే రాష్ట్రప్రభుత్వ ధ్యేయం