దోమకొండ, ఏప్రిల్ 7: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. దోమకొండ మండలంలోని అంబారీపేట గ్రామంలో రైతువేదిక భవనాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమ కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. రైతులను సంఘటితం చేసేందుకు రైతువేదికలను నిర్మించారని, రైతులు క్లస్టర్ల వారీగా వేదికల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకొని వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ పంటలు సాగుచేసుకొని అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, నాయకులు విప్ గోవర్ధన్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ కోట సదానంద, మాజీ జడ్పీటీసీ మధుసూదన్రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, జడ్పీటీసీ తిర్మల్గౌడ్, ఏఎంసీ చైర్మన్ కుంచాల శేఖర్, విండో వైస్ చైర్మన్ రంగోలి శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సయ్య, సర్పంచులు సలీం, అంజలి, సమత స్వామిగౌడ్, ఉపసర్పంచ్ వనిత, ఎంపీటీసీలు రమేశ్, శారద, రాజేశ్వర్, దోర్నాల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమానికి పెద్ద పీట
రాష్ట్ర ప్రజల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని ప్రభుత్వ విప్ గోవర్ధన్ అన్నారు. బీబీపేట్, యాడారం గ్రామాల్లో రైతువేదికలను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. రైతును రాజు చేయడం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. రైతులను సంఘటితం చేయడానికి రైతువేదికలను నిర్మించారని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో శ్రీమహాలక్ష్మి ఫిల్లింగ్ స్టేషన్ను విప్ ప్రారంభించారు. జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్కుమార్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీపీ బాలమణి, వైస్ ఎంపీపీ రవీందర్రెడ్డి, సర్పంచులు లక్ష్మీ సత్యనారాయణ, వెంకట్రావు, కాంట్రాక్టర్ గోపాల్రావు, మహేందర్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు నాగరాజ్గౌడ్, రైతు బంధు సమితి గ్రామ కన్వీనర్ మీసాల సత్తయ్య, చంద్రాగౌడ్, ఎంపీటీసీలు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ…