బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్
మురుగు కాల్వల నిర్మాణ పనులు ప్రారంభం
ఇచ్చోడ, ఏప్రిల్ 7: గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో రూ.6 లక్షలతో చేపడుతున్న మురుగు కాల్వల నిర్మాణానికి బుధవారం ఆయన భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ఇది సీఎం కేసీఆర్ ఘనత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రీతమ్రెడ్డి, సర్పంచ్ సునీత, ఎంపీటీసీ శివ కుమార్రెడ్డి, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
నేరడిగొండ, ఏప్రిల్ 7: చిన్నబుగ్గారం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ వసంత్రావు కూతురు శృతి ఇటీవల మృతి చెందింది. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శించారు. ఆయన వెంట ఎంపీపీ రాథోడ్ సజన్, సర్పంచ్ జాదవ్ సుభాష్ ఉన్నారు.
ఆడబిడ్డలకు వరం కల్యాణ లక్ష్మి
తలమడుగు, ఏప్రిల్ 7: పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు వరమని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో 19 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఇమ్రాన్ఖాన్, ఎంపీడీవో రమాకాంత్, ఎంపీటీసీ చంటి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ వెల్మ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు తోట వెంకటేశ్, రాజేశ్వర్ పాల్గొన్నారు.
గ్రామాల్లో అద్దంలా రోడ్లు
తాంసి, ఏప్రిల్ 7: గ్రామాల్లో రోడ్లు అద్దంలా మెరిసిపోతున్నాయని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. తాంసి నుంచి కప్పర్ల వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. ఆయన వెంట నాయకులు అబ్దుల్లా, కిరణ్, వెంకటేశ్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
18 ఏండ్లు నిండిన వారందరికీ టీకా