వాషింగ్టన్: అమెరికాలో 18 ఏండ్లు నిండిన వారందరూ ఈ నెల 19 నుంచి కరోనా టీకా వేయించుకోవడానికి అర్హులేనని ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 75 రోజుల్లో 15 కోట్ల టీకాలు వేసిందని, 100 రోజుల్లో 20 కోట్ల డోసులు వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చెప్పారు. కరోనా విషయంలో అమెరికా ఇంకా చావు బతుకుల రేసులోనే ఉందన్నారు.