ఎడపల్లి (శక్కర్నగర్): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంతో పల్లెలు, పట్టణాలు పచ్చదనాన్ని సంతరించుకుంటున్నాయని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. బుధవారం ఎడపల్లి మండలంలోని జానకంపేట్ – బాసర రహదారి డివైడర్ల మధ్య నుడా ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విఠల్రావు మాట్లాడుతూ రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని సంరక్షించడంతో రహదారులు సైతం పచ్చగా కనిపిస్తున్నాయన్నారు. జానకంపేట్ నుంచి నవీపేట్ పెట్రోల్ బంక్ వరకు బాసర రోడ్డు డివైడర్ల మధ్య నుడా ఆధ్వర్యంలో సుమారు 3వేల 5వందల మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు.
7వ విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాలను ఈనెల 31లోగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. నాటిన ప్రతిమొక్కను సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, జడ్పీ వైస్ చైర్పర్సన్ ఎం.రజిత, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్, డైరెక్టర్లు అక్తర్ఖాన్, మల్లయ్య, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఏటీఎస్ శ్రీనివాస్, నవీపేట్ ఎంపీడీవో సాజీద్ అలీ, నవీపేట్ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింగ్రావు, మోహన్, జానకంపేట్ ఉప సర్పంచ్ విజయ్, ఎంపీటీసీ మంద సంజీవ్, రాచర్ల శేఖర్ రాజు పలువురు పాల్గొన్నారు.