ఓటు హక్కు వినియోగించుకున్న ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు
రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్లో సోమవారం రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్తోపాటు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్రెడ్డి, బిగాల గణేశ్గుప్తా, షకీల్, హన్మంత్ షిండే, జాజాల సురేందర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే.
రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు మంత్రి కేటీఆర్తో కలిసి హైదరాబాద్లో సోమవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు.