ఖలీల్వాడి, నవంబర్ 24 : జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా గురువారం ప్రారంభించారు. న్యూ కలెక్టరేట్ ఎదురుగా సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 2 కోట్ల నిధులతో పట్టణ ప్రగతి పనులు చేపట్టామని తెలిపారు.
సీసీ రోడ్డు పనులకు భూమిపూజ
జిల్లా కేంద్రంలోని 49వ డివిజన్ పరిధిలోని పూసలగల్లీలో సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే గణేశ్గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 50 లక్షల నిధులతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఆయా కార్యక్రమాల్లో మేయర్ దండు నీతూకిరణ్, మాజీ మేయర్ ఆకుల సుజాత, కార్పొరేటర్లు మెట్టు విజయ్, పంచరెడ్డి ప్రవళిక, నుడా డైరెక్టర్ కన్న బాలాజీ, టీఆర్ఎస్ నాయకులు మహేశ్, అరుణ్, శివచరణ్, పంచరెడ్డి అనిత, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.