మోర్తాడ్, డిసెంబర్ 14: మార్చి వరకు ఉన్న టార్గెట్ను డిసెంబర్ ఆఖరు వరకే సాధించేలా ప్రణాళిక చేసుకోవాలని బ్యాంకు లింకేజీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ నీలిమ సూచించారు. మండల సమాఖ్య కార్యాలయంలో బుధవారం ఐకేపీ వీవోఏలతో అధికారులు సమీక్ష నిర్వహించారు. బ్యాంకు లింకేజీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ నీలిమ మాట్లాడుతూ ఈ ఏడాది బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీలో జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నందుకు మండల సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో ఏపీఎం తడకల శ్రీనివాస్, సీసీలు మహేందర్, గాజుల శ్రీనివాస్, ఈర్నాల రాజేశ్వర్, స్త్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ సరస్వతి, ఎంఎస్ సిబ్బంది పాల్గొన్నారు.