మోర్తాడ్, డిసెంబర్ 14: క్రీడల్లో పాల్గొనడం ద్వారా క్రమ శిక్షణ అలవడుతుందని ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ అన్నారు. తిమ్మాపూర్లో వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న వాలీబాల్, కబడ్డీ ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలను బుధవారం తహసీల్దార్ బావయ్య, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో మోర్తాడ్ పీఏసీఎస్ చైర్మన్ అశోక్ రెడ్డి, తిమ్మాపూర్ సర్పంచ్ బద్దం చిన్నారెడ్డి, ఎంపీటీసీ ఆస్మా అజారుద్దీన్, వీడీసీ సభ్యులు రాజుల లింగన్న, దేవేందర్, సుమన్, అశోక్, హరీశ్, మురళి, దేవాలయ కమిటీ సభ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు శ్యామ్, రాజేందర్, రాజేశ్, నాగేశ్, రమణ, నరేందర్, రాజ శేఖర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.