నందిపేట్, డిసెంబర్ 8 : ఆర్మూర్ పట్టణంలోని సిద్ధుల గుట్టను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. సిద్ధుల గుట్ట ఘాట్ రోడ్డు పొడవునా రూ. 40 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను గురువారం ఆయన ప్రారంభించారు. దీంతోపాటు రూ.20 కోట్లతో నిర్మించిన డబుల్లైన్తో ఘాట్ రోడ్డు, రూ.50లక్షలతో నిర్మించిన బాత్రూమ్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐదున్నరేండ్లుగా అభివృద్ధి పథంలో పురోగమిస్తున్న సిద్ధుల గుట్ట నేడు ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోందన్నారు. సెంట్రల్ లైటింగ్తో కొత్తకాంతులు విరజిమ్ముతున్న గుట్టపై నిర్మాణాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయన్నారు.
ప్రస్తుతం జ్ఞాన మందిర నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆర్మూర్ ఎస్ఎస్కే సమాజ్ ఆధ్వర్యంలో సహస్రార్జున స్వామి ఆలయ నిర్మాణం చేపట్టి త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఇందుకు సంబంధించిన పనులను జీవన్రెడ్డి పరిశీలించి ఆలయ కమిటీ ఎస్ఎస్కే సమాజ్ కమిటీ సభ్యులకు పలు సలహా లు, సూచనలు చేశారు. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ప్రారంభించడానికి సిద్ధులగుట్టపైకి వచ్చిన జీవన్రెడ్డికి శివాలయం అర్చకులు, ఆలయ కమిటీ సభ్యు లు, భక్తులు ఘన స్వాగతం పలికారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.