బిచ్కుంద, నవంబర్ 29: బిచ్కుంద ప్రభుత్వ దవాఖానను అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని జుక్కల్ ఎ మ్మెల్యే హన్మంత్షిండే అన్నా రు. మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో మంగళవారం నిర్వహించిన దవాఖాన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. డిసెంబర్ మూడో తేదీన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు రానున్నారని, అందుకోసం ఏర్పాట్లు చేయాలని వైద్యులకు సూచించారు. దవాఖానలో డయాలసిస్ సెంటర్ను మంత్రి ప్రారంభిస్తారని అన్నారు. దవాఖానలో వైద్యులను నియమించే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. పరీక్షల కోసం కొత్తగా గదిని నిర్మించే విషయమై కమిటీ సభ్యులతో చర్చించారు. సమావేశంలో ఎంపీపీ అశోక్పటేల్, జడ్పీటీసీ భారతీరాజు, వైద్యులు పాల్గొన్నారు.
మంత్రి హరీశ్రావు సభను విజయవంతం చేయాలి
మద్నూర్, నవంబర్ 29: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. మండలంలోని డోంగ్లిలో మంగళవారం నిర్వహించిన టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నూతన మండలం డోంగ్లీలో రెవెన్యూ కార్యాలయాన్ని డిసెంబర్ 3న మంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. ప్రతి గ్రామం నుంచి ప్రజలను పెద్దసంఖ్యలో తరలించాలన్నారు. సభ విజయవంతం చేసేందుకు పలు సలహాలు, సూచనలు అందజేశారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ రామ్పటేల్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ మండల అధ్యక్షులు సంగమేశ్వర్, సొసైటీ చైర్మన్ శ్రీనూపటేల్, సర్పంచుల సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు దరాస్ సురేశ్, గఫార్, నాయకులు శశాంక్పటేల్, దీన్దయాల్, దిగంబర్రావు, అశోక్పటేల్, రాజు, వెంకట్రావు దేశాయ్, మొయిన్పటేల్, శంకర్పటేల్, కాశీనాథ్పటేల్, మధుకర్, సూర్యకాంత్, పండిత్రావుపటేల్, హన్మంత్రావు దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.