ఖలీల్వాడి, నవంబర్ 27 : తమిళనాడులోని నమక్కల్ జిల్లా కేంద్రంలో కేసీఆర్ మెగా జాబ్మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్కు చెందిన దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు హాజర య్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబ్మేళాలో దాదాపు 42 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. దేశం బాగుండాలంటే రైతు బాగుండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకోసం టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారన్నారు. జాబ్మేళాలో వెయ్యి మంది పాల్గొన్న 800 మందికి నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలసుబ్రమణ్యం, పీకే దైవసిగామని, సింధీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.