నిజాంసాగర్, నవంబర్ 25: జిల్లాలోని ప్రాజెక్టులతో పాటు తొమ్మిది చెరువుల్లో 2022-23 సంవత్సరానికి గాను 48లక్షల రొయ్య పిల్లలను విడుదల చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా మత్స్యశాఖ అధికారి వరదారెడ్డి అన్నారు. జుక్కల్ మండలంలోని కౌలాస్నాలా ప్రాజెక్టులో 4.90 లక్షల రొయ్య పిల్లలను శుక్రవారం విడుదల చేసిన అనంతరం మాట్లాడా రు. ఈ సంవత్సరం 48లక్షల రొయ్య పిల్లల విడుదల లక్ష్యం కాగా కౌలాస్నాలా ప్రాజెక్టు తో కలిపి 33లక్షలు పూర్తవుతుందని తెలిపారు. వారం రోజుల్లో వంద శాతం పూర్తిచేస్తామని చెప్పారు. జిల్లాలోని 634 చెరువుల్లో 2.70కోట్ల చేప పిల్లలను ఈ సంవత్సరం విడుదల చేయడం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 2.50కోట్ల చేప పిల్లలను విడుదల చేశామని, మరో నాలుగు రోజుల్లో వంద శాతం పూర్తిచేస్తామని తెలిపారు. ప్రత్యేకాధికారి శివప్రసా ద్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి డోలీసిం గ్, నాయకుడు నీలూపటేల్, వైస్ ఎంపీపీ ఉమాకాంత్ కులకర్ణి, సావర్గావ్ సర్పంచ్ కిషన్పవార్, విండో చైర్మన్ శివానంద్, శంకర్పటేల్, దిలీప్ పాల్గొన్నారు.