నిజామాబాద్ క్రైం, నవంబర్ 20 : శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో కమిషనర్ ఆఫ్ పోలీస్ కేఆర్.నాగరాజు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాకు నాలుగు రోజుల క్రితం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను రప్పించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో ఆర్ఏఎఫ్ బలగాలతో ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు.
జిల్లాకేంద్రంలోని త్రీటౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్కాలనీ నుంచి దుబ్బ చౌరస్తా వరకు వివిధ కాలనీల గుండా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆదివారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం, ప్రజలకు పోలీస్ బలగాలు అండగా ఉంటాయని తెలిపేందుకు ఫ్లాగ్మార్చ్ను నిర్వహించినట్లు సీసీ తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఏఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్తో పాటు ఇతర ఫోర్స్, నిజామాబాద్ రూరల్ ఎస్సై లింబాద్రి, సిబ్బంది పాల్గొన్నారు.