డొంకేశ్వర్, నవంబర్ 20 : నూతన మండలంగా ఏర్పాటైన డొంకేశ్వర్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. కేసీఆర్ సారథ్యంలోనే కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఇటీవల నూతన మండలంగా డొంకేశ్వర్ ఏర్పాటుకాగా, ఆదివారం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలను జీవన్రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. డొంకేశ్వర్ ప్రజల మనోగతాన్ని గౌరవిస్తూ కొత్త మండలాన్ని ఏ ర్పాటు చేసిన సీఎం కేసీఆర్కు పాదాభివందనం చేస్తున్నట్లు చెప్పారు.
కేసీఆర్ ఆదర్శ పాలకుడని, ప్రజల మేలు కోసం ఎంతకైనా తెగిస్తారన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపారన్నారు. కేసీఆర్ పాలనను చూసి ఓర్వలేక బీజేపీ.. తెలంగాణ వ్యతిరేక కుట్రలకు తెరలేపిందన్నారు. మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతున్నదని మండిపడ్డారు. ‘పేదింటి ఆడబిడ్డల పెండ్లిలకు లక్షా 116 రూపాయలిస్తున్న తెలంగాణ మోడల్ కావాలా..దేశ ప్రజలను హింసిస్తున్న రాక్షస పార్టీ బీజేపీ కావాలా అని ప్రశ్నించారు.
ఎకరానికి రూ.10వేల చొప్పున రైతుబంధు ఇచ్చే కేసీఆర్ కావాలా లేదా రైతు మెడకు ఉరి బిగిస్తున్న మోదీ కావాలా అని ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్ర జల అభ్యున్నతికి పాటుపడుతూ ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న కేసీఆర్ మోడలే దేశానికి శరణ్యమని అన్నారు. నూతన తహసీల్దార్ రవీంద్రనాయక్, జడ్పీచైర్మన్ దాదన్నగారి విఠల్రావు, సర్పంచులు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ చైర్మ న్లు, వీడీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.