ఇందూరు, అక్టోబర్ 27 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న కార్యక్రమాలపై ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఏపీవోలను ఆదేశించారు. గురువారం ఆయన ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శనివారం మధ్యాహ్నంలోగా క్షేత్రసహాయకులకు శిక్షణ పూర్తి చేయాలని ఆదేశించారు. రోజువారీ సాధారణ విధులు నిర్వర్తిస్తూనే, హరితహారం, ఉపాధిహామీ కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించడం, తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాట్లు , పల్లెప్రకృతి వనాలు, హరితవనాలు, నర్సరీల ఏర్పాటుపై ఫీల్డ్ అసిస్టెంట్లకు వారు నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలపై శిక్షణలో స్పష్టం గా తెలియజేయాలని సూచించారు.
ఎక్కడైనా ఫీల్డ్ అసిస్టెంట్లు లేని పక్షంలో సీనియర్ మేట్లకు శిక్షణ ఇవ్వాలన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని రహదారులకు ఇరువైపులా ప్రతి మూడు మీటర్లకు ఒకటి చొప్పున కనీసం ఆరు అడుగుల ఎత్తు కలిగిన మొ క్క తప్పనిసరిగా ఉండాలన్నారు. మొక్కల నిర్వహణ, సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నాలుగు వందల మొక్కలకు ఒక వన సేవకుడిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
పల్లెప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, వైకుంఠధామాలు, కంపోస్ట్ షెడ్లు, ప్రభుత్వ కార్యాల య ఆవరణలు, విద్యాసంస్థలు, విద్యుత్ సబ్స్టేషన్లు, పీహెచ్సీలు, అన్ని ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు పెంచుతూ పచ్చదనాన్ని పెంపొందించేలా ఫీల్డ్ అసిస్టెంట్లు నిరంతరం పరిశీలన జరిపేలా పర్యవేక్షణ చేయాలని ఏపీవోలను ఆదేశించారు. ఉపాధిహామీ పథకం కింద పనులను గుర్తిస్తూ కూలీలకు ఉపాధి కల్పించాలన్నారు. గతేడాది కన్నా ఎక్కువ సంఖ్యలో కూలీలు పనులకు హాజరయ్యేలా చూడాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దేశిత లక్ష్యం సాధించాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు.
ముఖ్యంగా ఫార్మేషన్ రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సోమవారం నుంచి ప్రతి జీపీ పరిధిలో కనీసం రెండు రోడ్డు నిర్మాణ పనులు ప్రారం భం కావాలన్నారు. గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నవంబర్ 15లోగా పూర్తి చేయాలని గడువు విధించారు. మొత్తం 660 క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి రావాలన్నారు. ప్రతి మం డలంలో కనీసం నాలుగు మినీ బృహత్ పల్లెప్రకృతి, ఒకటి బృహత్ పల్లెప్రకృతి వనం పూర్తి చేయాలన్నారు. 107 హరితవనాల్లో అవసరమైన చోట మొక్కలను నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. 2023-24 సంవత్సరాలకు సంబంధించి నర్సరీలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన (పీఎంఏజీ వై) కింద జిల్లాకు రూ.రెండు కోట్ల నిధులు మంజూరైనందున నిర్దేశిత ప్రాంతాల్లో పనులను తక్షణమే ప్రారంభించేలా చొరవ చూపాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. భీమ్గల్ మండలం రహత్నగర్, కారేపల్లి, తాళ్లపల్లి, ఇందల్వా యి మండలం వెంగల్పహాడ్, రంజిత్నాయక్ తండా, మోపాల్ మండలం ఎల్లమ్మకుంట తండా, సిరికొండ మండలం పందిమడుగు, పాకాల, నవీపేట్ మండలం అబ్బాపూర్(బీ), వర్ని మండలం శంకోరా తండాల్లో ఆయా పనులను వెంటనే ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఆర్డీవో చందర్, డీటీడబ్ల్యూ నాగోరావు, ఏపీడీ సంజీవ్ పాల్గొన్నారు.