విద్యానగర్, అక్టోబర్ 18 : ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకునే వారు ఫారం (8) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. కొత్తగా ఓటరు నమోదు కోసం ఫాం (6) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బూత్ లెవల్ అధికారుల వద్ద, ఓటరు హెల్ప్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. జిల్లాలో 790 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 1500 లోపు ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఎల్లారెడ్డిలో 269, కామారెడ్డిలో 266, జుక్కల్లో 225 పోలింగ్ కేం ద్రాలు ఉన్నట్లు వివరించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఆర్డీవో శీను, తహసీల్దార్ ప్రేమ్కుమార్, ఎన్నికల విభా గం పర్యవేక్షకుడు సాయి భుజంగరావు, నాయబ్ తహసీల్దార్లు ప్రియదర్శిని, శ్రావణి, అధికారులు నరేందర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.