నాగిరెడ్డిపేట్, అక్టోబర్ 4: దళితులను ధనవంతులు చేయడానికే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రారంభించారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలంలోని గోపాల్పేట్ గ్రామంలో దళితబంధు ద్వారా మంజూరైన టెంట్హౌస్ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు ద్వారా పేద దళితుల జీవితాల్లో వెలుగులు నిం పుతున్నదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నరన్నారు. ఎల్లారెడ్డి ఏఎంసీ మాజీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నర్సింహులు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మోతె శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కృష్ణ, సర్పంచులు వంజరి సునీత, కిచ్చయ్యగారి సునీత, మురళి, అనూ ష, విజితారెడ్డి. ప్రవీణ్, కృష్ణారెడ్డి, శ్రీధర్గౌడ్, ఎంపీటీసీలు గుర్రాల సుశీల, మాధవి, వినీతారెడ్డి, విమలవ్వ, నారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్ధయ్య, ప్రధాన కార్యదర్శి మంగలి యాదగిరి, నాయకులు బోయిని విఠల్, విఠల్రెడ్డి, కిరణ్, వెంకట్రెడ్డి, దుర్గారెడి, వాసురెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రంలో దుర్గామాతను ఎమ్మెల్యే దర్శించుకొని పూజలు చేశారు.
దేవీ నవరాత్రులు ఎంతో పవిత్రమైనవి..
దేవీ నవరాత్రులు ఎంతో పవిత్రమైనవని ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండల కేంద్రంలోని పలు దుర్గా మండపాల వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొని భక్తులకు భోజనం వడ్డించారు. కార్యక్రమంలో ఎంపీపీ రవి, సీడీసీ చైర్మన్ మహిందర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సాయిరెడ్డి, వైస్ ఎంపీపీ నర్సింహులు, సర్పంచ్ సంజీవు, నాయకులు రాంరెడ్డి, సాయిరెడ్డి, గోపాల్రావు, జైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణపల్లిలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.