విద్యానగర్, అక్టోబర్ 4 : జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారులు జాతీ య స్థాయిలో రాణించాలని ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ అన్నారు. కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన అథ్లెటిక్స్ క్రీడాకారులకు మెడల్స్ను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. గ్రామీ ణ ప్రాంత క్రీడాకారులు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందూప్రియ, కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, జిల్లా యువజన క్రీడల అధికారి దామోదర్రెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అనిల్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
జిమ్ను ప్రారంభించిన ప్రభుత్వ విప్..
కామారెడ్డిలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జిమ్ కేంద్రాన్ని ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిమ్ను యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నా రు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1000, నెలకు రూ.200 ఫీజు ఉంటుంద న్నారు. ఉదయం 6 నుంచి 9 గం టల వరకు సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు జిమ్ తెరిచి ఉంటుందని పేర్కొన్నారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేం ద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియం లో రాష్ట్ర స్థాయికి జిల్లా స్థాయి సీనియర్స్ మెన్ అండ్ ఉమెన్ సెలక్షన్స్ మంగళవారం నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 70 మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 7, 8వ తేదీల్లో వరంగల్లోని జేఎన్ స్టేడియం లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఈ సెలక్ష న్స్కు ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడాకారులు ఉత్తమ ప్రతిభచాటి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి దామోదర్రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్రావు, అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, కార్యదర్శి అనిల్కుమార్, సభ్యులు రంగవెంకటేశ్వర్ గౌడ్, శ్రీనివాస్, మధుసూదన్రెడ్డి, నరేశ్రెడ్డి, భాస్కర్రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.